E-Paper
Advertisement

KTR : మరోసారి పెద్దమనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..

KTR : మరోసారి పెద్దమనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..
Advertisement

KTR : మంత్రి కేటీఆర్ పెద్దమనసు ఓ ఇంటికి కొండంత అండగా నిలిచింది. ముగ్గురు కూతుళ్లు అంగవైకల్యంతో బాధపడుతూ.. వారికి చికిత్స అందించలేక ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడకు చెందిన వెంకటయ్య, శంకుతల దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు ముగ్గురూ అంగవైకల్యంతో బాధపడుతున్నారు.

వారికి చికిత్స చేయించి ఆర్థికంగా చితికిపోయింది ఆ కుటుంబం. ఐనా కూతుళ్లకు నయం కాలేదు. దీంతో తాము చనిపోవాలనుకుంటున్నామని.. తమను ఆదుకోవాలని ఆ ఆడ బిడ్డలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మీరు ఎంతో మందికి సహాయం చేశారు.

Advertisement

వీళ్లకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సహాయం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు. దీంతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్.. బాధితుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు చికిత్సకు అవసరం అయిన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి మంత్రి కేటీఆర్ చొరవతో ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని నింపింది.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×