E-Paper
Advertisement

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం
Advertisement

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిజాం కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.

హాస్టల్‌ వసతి అంశంపై ఇటీవల బషీర్‌బాగ్‌ కూడలిలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌లోనూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని అటు విద్యాశాఖ మంత్రిని, ఇటు ప్రిన్సిపల్ ను ఆదేశించారు.

Advertisement

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×