E-Paper
Advertisement

Ktr : ఆ సమస్యను వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం

Ktr : ఆ సమస్యను  వెంటనే పరిష్కరించండి.. సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ఆదేశం
Advertisement

Ktr : హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌లో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యపై కేటీఆర్‌ తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చించారు. విద్యార్థుల ఆందోళనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్‌ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిజాం కాలేజ్‌ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.

హాస్టల్‌ వసతి అంశంపై ఇటీవల బషీర్‌బాగ్‌ కూడలిలో విద్యార్థులు ధర్నాకు దిగారు. కాలేజ్‌లో ప్రిన్సిపల్‌ ఛాంబర్‌లోనూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ సమస్యను పరిష్కరించాలని అటు విద్యాశాఖ మంత్రిని, ఇటు ప్రిన్సిపల్ ను ఆదేశించారు.

Advertisement

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×