Big Stories

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు.

- Advertisement -

ఇక కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతికి మద్ధతు ఇవ్వడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మంత్రి హరీశ్ రావు, న్యాయనిపుణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. శని, ఆది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కవిత ఈడీ విచారణ జరగనున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ప్రస్తావించి ఈడీ సంచలనం సృష్టించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News