E-Paper
Advertisement

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
Advertisement

H3N2: దేశంలో H3N2 వైరస్ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు ఈ మహ్మరి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది. కొన్నిచోట్ల ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,038 కేసులు నమోదయ్యాయి.

ఇక ఈ మహమ్మారికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. H3N2 కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మహమ్మారి భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. కానీ అందోళన చెందాల్సిన అవసరం లేదని.. మార్చి చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

Advertisement

ప్రతి ఏటా ఈ మహమ్మారి వ్యాప్తి దేశంలో రెండు సార్లు ఉంటుందని.. అందులో ఒకటి జనవరి నుంచి మార్చి మధ్య ఉంటుందని వెల్లడించింది. ఈక్రమంలో మార్చి చివరి నాటికి కేసులు సంఖ్య తగ్గుతాయని అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని విజయవంతంగా జయించవచ్చిని సూచించింది.

మరోవైపు ఈ మహమ్మారి కారణంగా దేశంలో రెండు మరణాలు సంభవించాయి. హరియాణాలో 56 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. కర్ణాటకలో 82 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈక్రమంలో జనాలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

Tags

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×