BigTV English

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: దేశంలో H3N2 వైరస్ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు ఈ మహ్మరి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది. కొన్నిచోట్ల ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,038 కేసులు నమోదయ్యాయి.


ఇక ఈ మహమ్మారికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. H3N2 కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మహమ్మారి భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. కానీ అందోళన చెందాల్సిన అవసరం లేదని.. మార్చి చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

ప్రతి ఏటా ఈ మహమ్మారి వ్యాప్తి దేశంలో రెండు సార్లు ఉంటుందని.. అందులో ఒకటి జనవరి నుంచి మార్చి మధ్య ఉంటుందని వెల్లడించింది. ఈక్రమంలో మార్చి చివరి నాటికి కేసులు సంఖ్య తగ్గుతాయని అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని విజయవంతంగా జయించవచ్చిని సూచించింది.


మరోవైపు ఈ మహమ్మారి కారణంగా దేశంలో రెండు మరణాలు సంభవించాయి. హరియాణాలో 56 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. కర్ణాటకలో 82 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈక్రమంలో జనాలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×