E-Paper
Advertisement

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: దేశంలో H3N2 వైరస్ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు ఈ మహ్మరి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది. కొన్నిచోట్ల ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,038 కేసులు నమోదయ్యాయి.

ఇక ఈ మహమ్మారికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. H3N2 కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మహమ్మారి భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. కానీ అందోళన చెందాల్సిన అవసరం లేదని.. మార్చి చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

ప్రతి ఏటా ఈ మహమ్మారి వ్యాప్తి దేశంలో రెండు సార్లు ఉంటుందని.. అందులో ఒకటి జనవరి నుంచి మార్చి మధ్య ఉంటుందని వెల్లడించింది. ఈక్రమంలో మార్చి చివరి నాటికి కేసులు సంఖ్య తగ్గుతాయని అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని విజయవంతంగా జయించవచ్చిని సూచించింది.

మరోవైపు ఈ మహమ్మారి కారణంగా దేశంలో రెండు మరణాలు సంభవించాయి. హరియాణాలో 56 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. కర్ణాటకలో 82 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈక్రమంలో జనాలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

Tags

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×