BigTV English

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: మార్చి చివరినాటికి H3N2 తగ్గుముఖం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం

H3N2: దేశంలో H3N2 వైరస్ కోరలు చాస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకు ఈ మహ్మరి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా రెట్టింపవుతోంది. కొన్నిచోట్ల ఆసుపత్రులన్నీ పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,038 కేసులు నమోదయ్యాయి.


ఇక ఈ మహమ్మారికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. H3N2 కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మహమ్మారి భారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. కానీ అందోళన చెందాల్సిన అవసరం లేదని.. మార్చి చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

ప్రతి ఏటా ఈ మహమ్మారి వ్యాప్తి దేశంలో రెండు సార్లు ఉంటుందని.. అందులో ఒకటి జనవరి నుంచి మార్చి మధ్య ఉంటుందని వెల్లడించింది. ఈక్రమంలో మార్చి చివరి నాటికి కేసులు సంఖ్య తగ్గుతాయని అభిప్రాయపడింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారిని విజయవంతంగా జయించవచ్చిని సూచించింది.


మరోవైపు ఈ మహమ్మారి కారణంగా దేశంలో రెండు మరణాలు సంభవించాయి. హరియాణాలో 56 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. కర్ణాటకలో 82 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈక్రమంలో జనాలు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

Tags

Related News

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Bihar News: బీహార్ ప్రీ-పోల్ సర్వే.. మహా కూటమికి అనుకూలం, ఎన్డీయే కష్టాలు? చివరలో ఏమైనా జరగొచ్చు

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Chennai News: పార్టీ తరపున మృతులకు 20 లక్షలు.. టీవీకే నేతలపై కేసులు, విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Big Stories

×