E-Paper
Advertisement

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!
Advertisement

Keesara ACB: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. కీసర చెరువు సమీపంలో కారులో రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బిర్యానీ కోసం వేదింపులు..

ఇందులో రూ.5 లక్షలు ఎస్సైకి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కీసర ఇన్‌స్పెక్టర్‌ ఆర్కపల్లి ఆంజనేయులు పాత్రపైనా ఆరోపణలు రావడంతో ఆయనను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. కెమికల్‌ పరీక్షల విషయంలోనూ బాధితుడిని ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలని వేధించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement

Also read: సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఏసీబీ సోదాలు..

గణేష్‌ నిమజ్జన విధుల్లో ఉన్న సమయంలోనే ఎస్సై లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎస్సై పరుగులు తీసినట్లు సమాచారం. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌తో పాటు సంబంధిత అధికారుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ మజీద్‌ అలీఖాన్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Advertisement

Also Read: హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

Tags

Related News

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.46,250 సబ్సిడీ..!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×