E-Paper
Advertisement

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

తెలంగాణ విలీనం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!
Advertisement

Telangana Merger: స్వేచ్ఛ బ్యూరో: సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన, మరపురాని రోజని, ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు నాంది పలికిన మహత్తర ఘట్టమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య పాలనకు స్పష్టమైన మార్గం సుగమమైందన్నారు.

వీరోచిత పోరాటం..

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగించిన వీరోచిత పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజల త్యాగాలను స్మరించుకుంటూ, అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్నారు. తెలంగాణ స్వేచ్ఛా పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకో, వర్గానికో లేదా ప్రాంతానికో పరిమితమైంది కాదని, ఇది ప్రజల హక్కులు, ఆత్మగౌరవం మరియు ప్రజాస్వామ్యం కోసం జరిగిన చారిత్రక పోరాటమని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించకుండా, నాటి పోరాటంలో భాగమైన అన్ని వర్గాల త్యాగాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.

మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం..

Advertisement

చరిత్రను విభజనకు కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా మలచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, ప్రజల హక్కులు, సంక్షేమం కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం మరియు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే నాటి పోరాట వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని, నాటి స్ఫూర్తితో తెలంగాణను మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Also read: సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

Tags

Related News

మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. సీక్రెట్స్ చెప్పిన సైబరాబాద్ సీపీ?

సీఎం రేవంత్ వ్యాఖ్యల వెనుక ఉన్న మతలబిదే.. బండి సంజయ్ క్లారిటీ!

అక్రమ భవనాలు కూలడానికి అసలు కారణం ఇదే.. హైడ్రా కమిషనర్ క్లారిటీ!

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి!

2028లో ఒంటరి పోరే.. బీజేపీతో పొత్తు లేదు.. హర్యానా వర్సిటీలో కేటీఆర్ క్లారిటీ

జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో భూ సమరానికి సిద్ధమైన సీపీఎం..!

Big Stories

Advertisement
×