E-Paper
Advertisement

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్

Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
Advertisement

Wine Shops Close: రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రేపు(సోమవారం) వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు పెట్టారు. దేశ వ్యాప్తంగా జనవరి 26న డ్రై డే పాటిస్తారు. తిరిగి జనవరి 27న మద్యం షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

మద్యం ధరలకు రెక్కలు

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మందుబాబుల వీక్ నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. సిండికేట్‌లుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జాతర దృష్ట్యా ఎక్సైజ్ శాఖ మేడారం పరిసరాల్లో 22 తాత్కాలిక లిక్కర్ షాపులకు అనుమతులు ఇచ్చింది. 9 రోజుల పాటు సాగే ఈ విక్రయాలకు రోజుకు రూ. 9 వేల చొప్పున ప్రభుత్వం లైసెన్స్ ఫీజు వసూలు చేస్తుంది. దీంతో ప్రభుత్వానికి రూ. 17.82 లక్షల ఆదాయం సమకూరనుంది. లైసెన్స్ షాపుల కంటే ముందే వందలాది బెల్ట్ షాపులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో మద్యం దొరికింది.

Advertisement

గత రెండు నెలల్లో ఇక్కడ సుమారు రూ. 1.40 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారులు ఒక్కో బాటిల్‌పై రూ. 50 నుంచి రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లైట్ బీర్ అసలు ధర రూ. 180 ఉండగా, దీనిని రూ. 250కి పైగా అమ్ముతున్నారు. స్ట్రాంగ్ బీర్ రూ. 290 వరకు విక్రయిస్తున్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×