Railway Safety: శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదం తప్పింది. రైళ్వేస్టేషన్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లు తెగినట్టు అక్కడి రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో అక్కడ రైళ్ల రాక పోకలు నిలిచిపోయాయి. సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఎర్పడింది.
భువనేశ్వర్ నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి భువనేశ్వర్ వెళ్ళే పలు రైళ్ళను ఎక్కడిక్కడే రైళ్వే అధికారులు నిలిపివేసారు. అకస్వాత్తుగా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్లు తెగిపడటం వలన ఈ అంతారాయం ఎర్పడిందని రైల్వే సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని రైళ్వే అధికారులు తెలపారు. రెండో నెంబర్ ప్లాట్ ఫాం సమీపంలో పట్టాలపై వెయిన్ విద్యుత్ వైర్లు తెగిపడాయి. అది గమనించిన సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి రైళ్ల రాకపోకలు ఆ ట్రాక్ పై వెల్లనివ్వకుండా కంట్రోల్ చేశారు.
Also read: ACB Raid: నిద్రపోయే మంచం కింద ముప్పై రెండు లక్షలా?.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ..!
రైళ్వే అధికారులు మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది యుద్దప్రాతిపదికన మరమత్తు పనులు చేపట్టారు. ఈ మధ్యకాలంలోనే పట్టాలపై తెగి పడిన విద్యుత్ వైర్లు ఘటనలో చోటు చేసుకోవడం ఇది రెండవసారి అని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్థతం ఎలాంటి ముప్పు లేకపోవడంతో అక్కడి రైళ్వే సిబ్బంది అంతా ఉపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదంలో నుండి భయటపడ్డారు. లేదంటే భారీగా ప్రమాదం జరిగే అంకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు.
Also read: Hit Run: ఆ ఒక్క క్లూతో.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి బిగ్ షాక్!