Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ముందు హైదరాబాద్ కు చెందిన మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. పదిహేనేళ్లుగా నరకం అనుభవిస్తున్నానని.. పిల్లలకు తిండిపెట్టి చదివించుకోలేని దీనస్థితిలో ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సహారా గ్రూప్ ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన కేసులో తన వాదనలు తానే వినిపించుకుంటా అని చెప్పిన ఆమె మెన్షన్ సమయంలో ఒక్కసారిగా విలపించటం కలకలం రేపింది. ఒక మహిళకు మంగళసూత్రంకన్నా ఏదీ ముఖ్యం కాదు.. నేను ధరించానో చూడండి అంటూ తన మెడలోని మంగళసూత్రాన్ని ప్రధాన న్యాయమూర్తికి ఆమె చూపించింది.
మహిళ ఆవేదనపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్.. సుప్రీంకోర్టుకు రావటానికి ప్రయాణ ఖర్చులు వృధా చేసుకోవద్దని సూచించారు. ఆన్ లైన్ లో హాజరు కండి అని విజ్ఞప్తి చేశారు. ఎంతసేపైనా వాదనలు వింటామని.. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు. అయితే ఈ సూచనను ఆ మహిళ సున్నితంగా తిరస్కరించారు. తన జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని.. తదుపరి విచారణకు స్వయంగా వస్తానని చెప్పారు.
Also Read: సముద్రపు సొరచేపలు.. టెక్నాలజీకి గొప్ప వరం.. ఈ ఆవిష్కరణలు చూస్తే మైండ్ బ్లాకే!
దాంతో వచ్చే వారం ఈ కేసు విచారణ కోసం ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీజే ప్రకటించారు. ఆ రోజున బోర్డు జాబితాలో ఈ కేసును మొదటి వరుసలో పెడతామన్నారు. ప్రత్యేక ధర్మాసనమే కేసు విచారణ జరుపుతుందని బాధిత మహిళకు భరోసా ఇచ్చారు.
Also Read: Whatsappలో కొత్త ఫీచర్.. ఇక మీ భార్య చేతిలో తన్నులు తినక్కర్లేదు!