E-Paper
Advertisement

Lady Aghori Case: లేడీ అఘోరీపై కేసు.. జోక్యం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి.. స్పీడ్ పెంచిన పోలీసులు

Lady Aghori Case: లేడీ అఘోరీపై కేసు.. జోక్యం చేసుకున్న మాజీ కేంద్ర మంత్రి.. స్పీడ్ పెంచిన పోలీసులు

Lady Aghori Case: ఇటీవల లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ పై కోడి బలిచ్చిన కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎవరు జోక్యం చేసుకున్నారో తెలుసుకుంటే.. షాక్ కావాల్సిందే. ఫిర్యాదు చేసింది రోహన్ రెడ్డి అయినప్పటికీ.. జోక్యం చేసుకున్నది మాత్రం మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ. అసలు మేనకా గాంధీ ఏమిటి, ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఏమిటని అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. అసలేం జరిగిందంటే..

లేడీ అఘోరీకి పెద్దగా పరిచయం కూడా అక్కర్లేదు. ఈవిడ మాటెత్తితే చాలు.. అమ్మో అంటూ భయాన్ని వ్యక్తం చేసే వారు కొందరు.. అంతా మోసమేనంటూ మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఏదిఏమైనా వివాదాల చుట్టూ ఈమె ఉంటుందో లేదో తెలియదు కానీ, ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో మాత్రం ఈమె ఉండడం విశేషం. ఏపీ పర్యటన సమయంలో నేరుగా ఓ పోలీస్ అధికారిపైనే దాడికి యత్నించగా, అక్కడ పోలీసులు తమదైన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చారన్న మాట కూడా మొన్నటి వరకు వినిపించింది.

ఏపీ పర్యటన అనంతరం తన స్వంత రాష్ట్రం తెలంగాణలోకి అడుగుపెట్టిన అఘోరీ తన మకాం వరంగల్ కు మార్చారు. వరంగల్ లోని బెస్త శ్మశానవాటికలో విచిత్ర పూజలు చేసి అక్కడి స్థానికులను భయకంపితులను చేసింది అఘోరీ. స్వయంగా స్థానికులే ఆమె కారుకు అడ్డుపడి, ప్రశ్నించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడ విచిత్ర పూజలు చేస్తూ.. ప్రాణంతో ఉన్న కోడిని బలిచ్చినట్లుగా ఓ వీడియో వైరల్ గా మారింది.

Also Read: Lizards in Vizag Airport: విమానంలో స్మగ్లింగ్.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. అన్నీ వింత జీవులే!

ఈ వీడియో ఆధారంగా కరీంనగర్ కు చెందిన రోహన్ రెడ్డి అనే విద్యార్థి, మామునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అసలు విషయాన్ని తన స్నేహితుడి సహాయంతో, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇక అంతే మేనకా గాంధీ ఎంటర్ కావడంతో అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాధారణంగా జంతుబలి అనేది నిషేధమని చట్టం చెబుతుందని, కానీ అఘోరీ శ్మశానంలో పూజలు నిర్వహించి బలి ఇవ్వడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేయడంతో ఫిర్యాదు చేసినట్లు బిగ్ టీవీతో రోహన్ రెడ్డి తెలిపారు.

ఈ విషయం ఇలా ఉంటే అఘోరీ మాత తన స్టైల్ మార్చారు. అది కూడా మీసాలు, గడ్డంతో ఇటీవల కనిపించారు. అంతేకాదు అఘోరీకి చెందిన ఓ పాత ఫోటో అంటే శ్రీనివాస్ గా ఉన్నప్పటి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఎన్నో వివాదాలు ఆమె చుట్టూ ఉండగా, తాజాగా కోడిని బలిచ్చిన కేసులో పోలీసులు స్పీడ్ పెంచినట్లు సమాచారం.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×