E-Paper
Advertisement

Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..

Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద  తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..
Advertisement

Ganja Crackdown : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. నిందితులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వద్ద వాహనలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎంహెచ్ 24 ఏయూ 8428 నెంబర్ గల డీసీఎంలో ఖాళీ టమాట ట్రేల మధ్యలో నిందితులు గంజాయి పెట్టి తరలిస్తున్నారు. 168 ప్యాకెట్లలో ఉన్న సుమారు 330 కేజీల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్ కు తరలించారు. గంజాయి అక్రమ తరలింపుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×