Meerpet Kidnap Mystery : రాజకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీసులు ఇంటర్నెట్ ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీని 12 గంటల్లో చేధించారు. మీర్పేట్లో నివాసం ఉండే ఇంర్నెట్ ఉద్యోగి రాధాకృష్ణను కొందరు బాలాపూర్ చౌరస్తావద్ద చితకబాది, వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి రాధాకృష్ణ కనిపించకపోవడంతో భార్య అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసులో భాగంగా భార్య అనుష చెప్పిన కీలక విషయాల ద్వారా పోలీసులు అత్యంత చాకచక్యంగా సాంకేతిక పరిఘ్నానంతో చేధించారు. రాధాకృష్ణ, అనూష దంపతులు 5 నెలల క్రితం గుంటూరు నుంచి మీర్పేట్కు వలస వచ్చారు. గుంటూరులో ఉన్నప్పుడు గోరంట్ల క్రాస్రోడ్డు వద్ద ఉడుత పవన్ అనే వ్యక్తితో వ్యాపార లావాదేవీల విషయంలో గొడవలు వచ్చాయి. అయితే అవే విభేదాల కారణంగా ఉడుత పవన్ కిడ్నాప్ చేయించొచ్చని తెలుసుకున్న పోలీసులు.. అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో రాధాకృష్ణను ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కార్యాలయానికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అనంతరం ఉడుత పవన్తో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.