E-Paper
Advertisement

Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?

Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?
Advertisement

Pawan: టీఆర్ఎస్ నేతలు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నారు. షర్మిల ఎపిసోడ్ లో వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. గులాబీ దళమంతా వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం పవన్ కల్యాణ్ పై బాణాలు ఎక్కుపెట్టారు. జనసేనాని ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను మళ్లీ కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు.

తెలంగాణకు వరిసాగు నేర్పింది ఎన్టీఆరే అని.. ఎవరో మూర్ఖుడు, ప్రముఖ సినీ నటుడు అనడం సిగ్గచేటన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతటి మూర్ఖుడిని ఎక్కడ చూడలేదని.. చరిత్ర తెలియని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1100 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణలో వరి సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకున్నా.. ప్రముఖ నటుడు అని మాత్రమే కోట్ చేశారు. అయితే, గతంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. మూర్ఖుడు అని పవన్నే అన్నారని అర్థమైపోతోంది. గతంలో జనసేనాని ఓ సమావేశంలో తెలంగాణ వాళ్లకి ఎన్టీఆర్ పాలనలోనే వరి అన్నం సాగు తెలిసిందని వ్యాఖ్యానించారు.

Advertisement

నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి.. వరి సాగుపై పవన్ వ్యాఖ్యలు గుర్తుకొచ్చి.. ఇలా విమర్శించారని అనుకోవచ్చా? జనసేనానిని మూర్ఖుడు అనేంత ఘటు కామెంట్ చేయాలా? అనుకోకుండా అనేశారా? లేదంటే, మిగతా మంత్రులు వ్యూహాత్మకంగా షర్మిల విషయంలో వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సెంటిమెంట్ రాజేస్తున్నట్టుగానే.. మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కావాలనే పవన్ కల్యాణ్ ను ముర్ఖుడని అన్నారా? అనే డౌటు.

అయితే, పవన్ కల్యాణ్ ఫుల్ ఫైర్ ఉన్న లీడర్. తనను ఎవరు ఏ మాట అన్నా.. బాగా గుర్తు పెట్టుకుంటారు. కచ్చితంగా వారి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. మరి, తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తనను మూర్ఖుడు అంటే ఊరుకుంటారా? చూడాలి ఏ రేంజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×