E-Paper
Advertisement

Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?

Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?
Advertisement

Pawan: టీఆర్ఎస్ నేతలు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నారు. షర్మిల ఎపిసోడ్ లో వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. గులాబీ దళమంతా వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటే.. మంత్రి నిరంజన్ రెడ్డి మాత్రం పవన్ కల్యాణ్ పై బాణాలు ఎక్కుపెట్టారు. జనసేనాని ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను మళ్లీ కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు.

తెలంగాణకు వరిసాగు నేర్పింది ఎన్టీఆరే అని.. ఎవరో మూర్ఖుడు, ప్రముఖ సినీ నటుడు అనడం సిగ్గచేటన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అంతటి మూర్ఖుడిని ఎక్కడ చూడలేదని.. చరిత్ర తెలియని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 1100 ఏళ్ల క్రితం నుంచే తెలంగాణలో వరి సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి ఎక్కడా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకున్నా.. ప్రముఖ నటుడు అని మాత్రమే కోట్ చేశారు. అయితే, గతంలో పవన్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో.. మూర్ఖుడు అని పవన్నే అన్నారని అర్థమైపోతోంది. గతంలో జనసేనాని ఓ సమావేశంలో తెలంగాణ వాళ్లకి ఎన్టీఆర్ పాలనలోనే వరి అన్నం సాగు తెలిసిందని వ్యాఖ్యానించారు.

Advertisement

నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి.. వరి సాగుపై పవన్ వ్యాఖ్యలు గుర్తుకొచ్చి.. ఇలా విమర్శించారని అనుకోవచ్చా? జనసేనానిని మూర్ఖుడు అనేంత ఘటు కామెంట్ చేయాలా? అనుకోకుండా అనేశారా? లేదంటే, మిగతా మంత్రులు వ్యూహాత్మకంగా షర్మిల విషయంలో వైఎస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సెంటిమెంట్ రాజేస్తున్నట్టుగానే.. మంత్రి నిరంజన్ రెడ్డి సైతం కావాలనే పవన్ కల్యాణ్ ను ముర్ఖుడని అన్నారా? అనే డౌటు.

అయితే, పవన్ కల్యాణ్ ఫుల్ ఫైర్ ఉన్న లీడర్. తనను ఎవరు ఏ మాట అన్నా.. బాగా గుర్తు పెట్టుకుంటారు. కచ్చితంగా వారి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు. మరి, తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తనను మూర్ఖుడు అంటే ఊరుకుంటారా? చూడాలి ఏ రేంజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×