E-Paper
Advertisement

Telangana Elections : నామినేషన్ల ప్రక్రియ.. రూల్స్ ఇవే..!

Telangana Elections :  నామినేషన్ల ప్రక్రియ..  రూల్స్ ఇవే..!

Telangana Elections : తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభకావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కీలక విషయాలు వివరించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. డిపాజిట్ మాత్రం ఒక్క సెట్ కే చెల్లించాలని చెప్పారు. అఫిడవిట్‌లోని కాలమ్స్ అన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అక్టోబరు 31 వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10కి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 9.10 లక్షల మంది యువత ఓట హక్కు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఓటర్ ఇన్‌ఫర్మేషన్‌ స్లిప్పులు ముందుగానే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

పోలింగ్ ఏర్పాట్లను వికాస్ రాజ్ వెల్లడించారు. 2 వేల పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉందన్నారు. ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం 18 వేల వీల్‌ఛైర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నవంబర్‌ 30న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలిపారు. మిగతా నియోజకవర్గాల్లో ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను వికాస్ రాజ్ వివరించారు. రాష్ట్రంలో 205 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రూ.453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మొత్తం 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని వెల్లడించారు. సీవిజిల్ యాప్ ద్వారా 2,487 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వివిధ కార్యక్రమాల అనుమతుల కోసం 9,630 దరఖాస్తులు వచ్చాయన్నారు. స్వాధీనం చేసుకున్న నగదుకు ఆధారాలు ఉంటే జిల్లా కమిటీల ద్వారా త్వరగా విడుదల చేయాలని ఆదేశించామన్నారు. వీలైనంత వరకు సామాన్యులకు ఇబ్బందులు లేకుండానే మార్గదర్శకాలు జారీ చేశామని సీఈవో వికాస్‌ రాజ్‌ స్పష్టం చేశారు.

ఇప్పటివరకు 137 ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని వికాస్ రాజ్ తెలిపారు. 13 బీఆర్ఎస్, 16 కాంగ్రెస్, 5 బీజేపీ, 3 బీఎస్పీకి సంబంధించి అనుమానిత కేసులు ఉన్నాయన్నారు. రైతుబంధు విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేశారు. ప్రలోభాలను కట్టడి చేయాలన్నదే ఎన్నికల సంఘం లక్ష్యమన్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. నవంబర్ 2 నాటికి ఓటర్ల సంఖ్య 3,21,88,753గా ఉందని సీఈవో వెల్లడించారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×