IT Raids in Hyderabad(Telangana today news) : హైదరాబాద్ మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. సుమారు 20 బృందాలు ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నాయి. తరచూ ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని పారిశ్రామిక వేత్తలు, బడావ్యాపారులు కలవర పడుతున్నారు.
అటు విశాఖపట్నంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 15 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పలు ఫార్మా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం సినిమా పరిశ్రమ టార్గెట్ గా హైదరాబాద్ లో ఐటీ దాడులు జరిగాయి. భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ లక్ష్యంగా సోదాలు జరిగాయి. నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో తనిఖీలు జరిగాయి. ఆ తర్వాత వస్త్రవ్యాపారులను లక్ష్యం చేసుకునే ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా మరోసారి ఐటీ బృందాలు రంగంలోకి దిగడంతో బడావ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.