E-Paper
Advertisement

Phone Tapping Case: క్లైమాక్స్‌కి ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కేసీఆర్ వరకు చేరిందా? రేపు ఎవరు?

Phone Tapping Case: క్లైమాక్స్‌కి  ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కేసీఆర్ వరకు చేరిందా? రేపు ఎవరు?
Advertisement

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ క్లయిమాక్స్‌కు చేరిందా? మాజీలు, అధికారులు విచారణ ముగియడంతో ఇక రాజకీయ నేతల వంతైందా? ఇప్పటికే హరీష్‌రావు సిట్ ముందు హాజరుకాగా, ఇవాళ కేటీఆర్ వంతైంది? రేపో మాపో కేసీఆర్ వరకు వంతు కానుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

క్లయిమాక్స్‌కి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని కుదిపిస్తోంది. ఈ కేసు సిట్ చేతికి వెళ్లిన తర్వాత దర్యాప్తు వేగవంతమైంది. మాజీ అధికారులు, ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను  సిట్  విచారించింది. సేకరించిన సమాచారం ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తోంది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌రావును అధికారులు విచారించారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్‌రావు వంతైంది.

పార్టీలో నెంబర్ గా ముద్రపడిన కేటీఆర్ వంతైంది. శుక్రవారం 11 గంటలకు ఆయన సిట్ ముందుకు హాజరవుతున్నారు.  ఆయన తర్వాత ఈ వ్యవహారం నేరుగా పెద్దాయనను తాకనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వరుసగా బీఆర్ఎస్ నేతలు విచారణకు వెళ్లడంతో ఆ పార్టీ నేతలు, కేడర్‌లో ఆందోళన మొదలైంది.

Advertisement

పెద్దాయన విచారణ కోసం ఎదురుచూస్తూ అంటూ ట్వీట్

దీంతో పార్టీ భవిష్యత్ ఏంటి? కీలక నేతలపై కేసులు నమోదైతే పార్టీ భవిష్యత్ ఏంటి? అంటూ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్టీ తమను ఆదుకుంటుందా? అంటూ సన్నిహితులతో చర్చించడం కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.

సిట్ విచారణ సమయంలో లోపల ఏం జరుగుతుంది? బయట బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారు? సీన్ టు సీన్ పేరిట నాలుగు లైన్లు రాసుకొచ్చారు. చివరగా ‘‘తెలంగాణ ఇన్నర్ ఫీలింగ్ అంటూ లోపల ఏం జరుగుతుందో మాకు తెలుసు లే’’ అని రాసుకొచ్చారు. ‘ఫోన్ ట్యాపింగ్ బాధితులు, కవిత తోపాటు పాపం పండింది. పెద్దాయన విచారణ కోసం ఎదురుచూస్తూ’ అంటూ ఆయన చేసిన ట్వీట్ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ALSO READ: హైకోర్టు ఆదేశాలు.. గీతం వర్సిటీ ఉక్కిరిబిక్కిరి! మేటరేంటి?

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×