Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేసీఆర్ కుటుంబం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనూ కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టిందని మంత్రి ధ్వజమెత్తారు.
2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని స్వయంగా పేర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. అప్పట్లో ఒక్క ఎకరం లేని వ్యక్తికి నేడు రూ.వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పదేండ్ల అధికారంలో ధరణి పోర్టల్ను ఆయుధంగా మలచుకుని దళితులు, పేదలు, ప్రభుత్వ అసైన్డ్ భూములను కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా దోచుకుందని మండిపడ్డారు.
We’ve seen the father’s land scams. Now, let’s see the Drama Rao @KTRBRS edition.
In 2009, KTR had just one acre. Now, he has a land empire of hundreds of acres.
For years, KTR boasted about his “American success” and claimed he had owned hundreds of acres since childhood.… https://t.co/7cVXlLxbXq pic.twitter.com/N8eQeCcx7s
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 17, 2026
అటు 2009 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేటీఆర్కు కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఉండేదని, మరి నేడు ఆయనకు వందల ఎకరాల భూ సామ్రాజ్యం ఎలా ఏర్పడిందో సమాధానం చెప్పాలని పొంగులేటి నిలదీశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు నేటికీ అప్పులపాలై ఉంటే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం అమరుల త్యాగాల పునాదులపై వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని ఆరోపించారు.
Also Read: కాంగ్రెస్ భూములు లాక్కుంటే.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది.. కవిత ఫైర్
పుట్టుకతోనే తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయని కేటీఆర్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని మంత్రి అన్నారు. ‘అఫిడవిట్లో తప్పులు రాసి నాడు ఎన్నికల కమిషన్ను మోసం చేశారా? లేక నేడు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారా?’ అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా కల్వకుంట్ల కుటుంబ భూదోపిడీని బట్టబయలు చేశారని, అక్రమ ఆస్తులు కూడబెట్టిన కేటీఆర్ ఇప్పుడు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు. గత పదేండ్లలో జరిగిన భూ అక్రమాలపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్