BigTV English

Shirisha : వికారాబాద్ జిల్లాలో యువతి హత్య కేసు.. పోస్టుమార్టం రిపోర్టే కీలకం..

Shirisha : వికారాబాద్ జిల్లాలో యువతి హత్య కేసు.. పోస్టుమార్టం రిపోర్టే కీలకం..

Shirisha : వికారాబాద్‌ జిల్లా కాళ్లాపూర్‌లో జరిగిన యువతి శిరీష హత్య కేసులో మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావ, కొంతమంది అనుమానితులను విచారిస్తున్నారు. శనివారం రాత్రి శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం పూరైంది. ఆ తర్వాత మృతదేహాన్ని శిరీష అన్న శ్రీకాంత్‌కు పోలీసులు అప్పగించారు.


శిరీష బావ అనిల్ ఈ దారుణానికి ఒడిగట్టునట్టు ఆరోపణలు వస్తున్నాయి. శిరీష ఫోన్ ఎక్కువగా వాడుతుండటంతో ఆమె సోదరుడు తిట్టినట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన అక్క భర్త అనిల్ కూడా శిరీషను కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైందని సమచాారం. ఆ తర్వాతే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది.

ఇంటికి కిలోమీటర్ దూరంలోని నీటి కుంటలో శిరీష మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు కోసి, కళ్లలో స్క్రూడ్రైవర్‌తో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమెను ఒక్కరే చంపి ఉంటారని భావించడం లేదని పోలీసులు చెబుతున్నారు. శిరీష తండ్రి, సోదరుడిని కూడా ప్రశ్నించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×