BigTV English

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజావాణి.. దరఖాస్తులతో క్యూ కట్టిన ప్రజలు

Prajavani: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్‌లో ప్రారంభమైంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుండగా భారీగా జనం తరలివచ్చి తమ గోడును అర్జీల రూపంలో అధికారుల ముందుంచుతున్నారు.


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దొరల పాలన, గడీల పాలనను అంతం చేసి ప్రజాపాలన చేసి చూపిస్తామని ఎన్నికలకు ముందు మాట ఇచ్చారు రేవంత్. దాని ప్రకారమే ప్రగతిభవన్‌ కంచెను తొలగించి ప్రజాభవన్‌గా మార్చారు. సీఎం చర్యలతో ఒకనాడు బడా నేతలకు సైతం ఎంట్రీ లేని ప్రగతిభవన్‌లో నేడు సామాన్యులు అడుగుపెడుతున్నారు. తమ గోడును అధికారులతో చెప్పుకుంటున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. పలు రకాల సమస్యలను దరఖాస్తుల రూపంలో అధికారులతో విన్నవించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడ ప్రజావాణికి జనం పోటెత్తారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×