E-Paper
Advertisement

Priyanka Gandhi: టి.కాంగ్ కల్లోలంపై ప్రియాంక ఆరా.. ఢిల్లీకి పిలుపు..

Priyanka Gandhi: టి.కాంగ్ కల్లోలంపై ప్రియాంక ఆరా.. ఢిల్లీకి పిలుపు..
Advertisement

Priyanka Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం ఇంకా సమసిపోలేదు. కమిటీల్లో పదవులు పొందిన టీడీపీ వలస నేతలు రాజీనామా చేసినా.. సీనియర్లు శాంతించలేదు. 20 తేదీన మరోసారి మీటింగ్ కు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీకి సీనియర్లు డుమ్మా కొట్టడంతో విషయం అధిష్టానానికి చేరింది.

కాంగ్రెస్ హైకమాండ్ టి.కాంగ్ సీనియర్ల వివాదం గురించి ఆరా తీసింది. నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీనే రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. పార్టీ కమిటీల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించినట్టు సమాచారం.

Advertisement

మంగళవారం జరపబోయే అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంకగాంధీ కోరినట్టు తెలుస్తోంది. అయితే, కమిటీల కూర్పు, రేవంత్ రెడ్డి తీరుపై ప్రియాంకగాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని అంటున్నారు. అన్నీ విన్న ఆవిడ.. అన్ని అంశాలపై మాట్లాడదామని.. ఢిల్లీకి రావాలని.. చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక జోక్యంతో ఈ నెల 23న సీనియర్లు హస్తిన వెళ్లనున్నట్టు టాక్.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×