BigTV English

Priyanka Gandhi: టి.కాంగ్ కల్లోలంపై ప్రియాంక ఆరా.. ఢిల్లీకి పిలుపు..

Priyanka Gandhi: టి.కాంగ్ కల్లోలంపై ప్రియాంక ఆరా.. ఢిల్లీకి పిలుపు..

Priyanka Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం ఇంకా సమసిపోలేదు. కమిటీల్లో పదవులు పొందిన టీడీపీ వలస నేతలు రాజీనామా చేసినా.. సీనియర్లు శాంతించలేదు. 20 తేదీన మరోసారి మీటింగ్ కు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీకి సీనియర్లు డుమ్మా కొట్టడంతో విషయం అధిష్టానానికి చేరింది.


కాంగ్రెస్ హైకమాండ్ టి.కాంగ్ సీనియర్ల వివాదం గురించి ఆరా తీసింది. నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీనే రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. పార్టీ కమిటీల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించినట్టు సమాచారం.

మంగళవారం జరపబోయే అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంకగాంధీ కోరినట్టు తెలుస్తోంది. అయితే, కమిటీల కూర్పు, రేవంత్ రెడ్డి తీరుపై ప్రియాంకగాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని అంటున్నారు. అన్నీ విన్న ఆవిడ.. అన్ని అంశాలపై మాట్లాడదామని.. ఢిల్లీకి రావాలని.. చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక జోక్యంతో ఈ నెల 23న సీనియర్లు హస్తిన వెళ్లనున్నట్టు టాక్.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×