E-Paper
Advertisement

AP TS: అప్పుల కుప్పగా తెలుగు రాష్ట్రాలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

AP TS: అప్పుల కుప్పగా తెలుగు రాష్ట్రాలు.. లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Advertisement

AP TS: తెలంగాణ అంటే అప్పుల రాష్ట్రం. ఏపీ అయితే అప్పుల కుప్పే. రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పదే పదే చేసే ఆరోపణ ఇది. తెలంగాణలో ప్రతీ ఒక్కరి మీద లక్షన్నర అప్పు ఉందంటూ కమలనాథులు తరుచూ చెబుతుంటారు. ఏపీలో ఒక్కొక్కరిపై 2 లక్షలకు పైగానే అప్పుందంటూ టీడీపీ గోల గోల చేస్తుంటుంది. సంపన్న రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చేశారంటూ విమర్శిస్తుంటారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పుబెల్లం పంచుతూ ఏపీని దివాళా తీయించారనేది చంద్రబాబు, పవన్ ల ఆరోపణ. ఇంతకీ తెలంగాణ చేసిన అప్పు ఎంత? ఏపీ నిజంగానే అప్పుల కుప్పనా? అంటే కేంద్ర ప్రభుత్వం అవుననే అంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. తెలంగాణలో 2018లో 1.60 లక్షల కోట్లు అప్పు ఉండగా.. 2022 నాటికి అది 3.12 లక్షల కోట్లకు చేరిందని కేంద్రం స్పష్టం చేసింది. 2017-18లోనే 95.9 శాతం అప్పులు నమోదైనట్టు తెలిపింది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి అప్పుల శాతం కాస్త తగ్గి.. 16.7 శాతానికి చేరినట్టు తెలిపింది.

Advertisement

తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం వెల్లడించింది. 2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా.. ఆ తరువాత భారీగా పెరిగి.. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు ఉన్నాయని పార్లమెంట్ లో తెలిపింది కేంద్రం.

ఇక, ఏపీ సైతం అదే తీరు. ఆంధ్రప్రదేశ్ లో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు ప్రకటించింది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు 2.29 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం 3.98 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 2017-18లో గతంతో పోలిస్తే 9.8 శాతం అప్పులు తగ్గగా.. 2020-21 నాటికి అప్పులు 17.1 శాతం పెరిగినట్టు తెలిపింది.

Advertisement

ఏపీ జీడీపీలో మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉండగా.. 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది. 2015లో రాష్ట్ర జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5 శాతానికి పెరిగినట్టు ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన వివరాలు చూస్తే.. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో దిగబడిపోతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు. సంక్షేమ పథకాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×