Nominations: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకుగాను 625 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
- Advertisement -
రాష్ట్రంలో మొత్తం 893 నామినేషన్లు దాఖలు కాగా.. ఇందులో 268 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరికొంత మంది పార్టీల బుజ్జగింపులతో నామినేషన్లను వెనక్కి తీసుకోవడంతో 17 లోక్ సభ స్థానాలకు 625 మంది బరిలో నిలిచారు.
- Advertisement -
తెలంగాణలో అత్యధికంగా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి 77 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.
- Advertisement -