BigTV English

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..
local news telangana

Rajanna Sircilla news(Local news telangana) :

అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కానుకలు తరలి వెళుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీరామునికి లక్ష లడ్డూలను తయారు చేసి అయోధ్యకు పంపిస్తోంది.


తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికుడు సీతమ్మకు బంగారు చీర నేశారు. రామాయణంలోని ఏడు ఖండాల్లో గల ముఖ్య ఘట్టాలను పది ఇతివృత్తాలుగా చేసుకుని బంగారు చీరను నేశారు వెల్ది హరిప్రసాద్‌. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపారు. ఈ బంగారు చీరను తయారు చేయడానికి దాదాపు 20 రోజులు పట్టిందని తెలిపారు హరిప్రసాద్.

ఇక ఈ సందర్భంగా హరి ప్రసాద్‌పై ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు. అలాగే జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లనున్న హరిప్రసాద్‌.. సీతమ్మ కోసం నేసిన చీరను మోదీకి చూపించనున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించనున్నారు.


Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×