E-Paper
Advertisement

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..
Advertisement
local news telangana

Rajanna Sircilla news(Local news telangana) :

అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కానుకలు తరలి వెళుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీరామునికి లక్ష లడ్డూలను తయారు చేసి అయోధ్యకు పంపిస్తోంది.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికుడు సీతమ్మకు బంగారు చీర నేశారు. రామాయణంలోని ఏడు ఖండాల్లో గల ముఖ్య ఘట్టాలను పది ఇతివృత్తాలుగా చేసుకుని బంగారు చీరను నేశారు వెల్ది హరిప్రసాద్‌. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపారు. ఈ బంగారు చీరను తయారు చేయడానికి దాదాపు 20 రోజులు పట్టిందని తెలిపారు హరిప్రసాద్.

Advertisement

ఇక ఈ సందర్భంగా హరి ప్రసాద్‌పై ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు. అలాగే జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లనున్న హరిప్రసాద్‌.. సీతమ్మ కోసం నేసిన చీరను మోదీకి చూపించనున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించనున్నారు.

Tags

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×