E-Paper
Advertisement

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..

Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..
local news telangana

Rajanna Sircilla news(Local news telangana) :

అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కానుకలు తరలి వెళుతున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీరామునికి లక్ష లడ్డూలను తయారు చేసి అయోధ్యకు పంపిస్తోంది.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికుడు సీతమ్మకు బంగారు చీర నేశారు. రామాయణంలోని ఏడు ఖండాల్లో గల ముఖ్య ఘట్టాలను పది ఇతివృత్తాలుగా చేసుకుని బంగారు చీరను నేశారు వెల్ది హరిప్రసాద్‌. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని ఉపయోగించినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపారు. ఈ బంగారు చీరను తయారు చేయడానికి దాదాపు 20 రోజులు పట్టిందని తెలిపారు హరిప్రసాద్.

ఇక ఈ సందర్భంగా హరి ప్రసాద్‌పై ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు. అలాగే జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లనున్న హరిప్రసాద్‌.. సీతమ్మ కోసం నేసిన చీరను మోదీకి చూపించనున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించనున్నారు.

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×