Big Stories

Rangareddy : విద్యార్ధులపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ..

Rangareddy : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజీ సమీపంలో విద్యార్థులపై లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థి మృతితో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు, కుటుంబసభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..

- Advertisement -

కొందరు లారీ డ్రైవర్లు తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఎందరో ప్రాణాలు బలవుతున్నాయి. రూల్స్ పాటించని లారీ డ్రైవర్లపై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News