E-Paper
Advertisement

ED: ఈడీ జేడీ మార్పు అందుకేనా?.. తెలంగాణపై కేంద్రం సీరియస్ గా ఉందా?

ED: ఈడీ జేడీ మార్పు అందుకేనా?.. తెలంగాణపై కేంద్రం సీరియస్ గా ఉందా?

ED: అర్థరాత్రి ఆకస్మికంగా బదిలీలు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్-ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి దినేష్ పరుచూరిని బదిలీ చేసింది కేంద్రం. ఆయన స్థానంలో రోహిత్ ఆనంద్ ను నియమించింది. దేశవ్యాప్తంగా 36 మందిని బదిలీ చేసినా.. హైదరాబాద్ జోన్ ను సాధారణ బదిలీగా చూడలేమంటున్నారు. తెలంగాణలో ఈడీ కేసులు సంచలనంగా మారిన నేపథ్యంలో ఏకంగా జేడీ స్థాయి అధికారిని ఇక్కడి నుంచి పంపించేయడం వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని చెబుతున్నారు. వరుస కేసులతో ఈడీ దూకుడు మీదుందిగా.. అయినా బదిలీ ఏంటి?

ఇది చాలదు. అంతకుమించి కావాలని కేంద్రం కోరుకుంటోందనే వాదన వినిపిస్తోంది. కేసినో కేసులో చీకోటి ప్రవీణ్ కేంద్రంగా పలువురు రాజకీయ ప్రముఖులకు కేసు బిగించాలని భావించినా.. ఇంకా వారి వరకు కేసు దర్యాప్తును తీసుకురాలేకపోయారనే అసంతృప్తి ఉన్నతాధికారులు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేసు విషయంలో ఈడీ బాగా అబాసుపాలైంది. రోహిత్ రెడ్డినే తిరిగి ఈడీని ప్రశ్నించే స్థాయికి పడిపోయింది. ఏ కేసు పెట్టారో మొదట్లో క్లారిటీనే లేదు. ఇచ్చింది కూడా మామూలు నోటీసులే. అందులో పస లేదని రోహిత్ రెడ్డినే ఎద్దేవా చేశారంటే.. అందుకు ఈడీ ఫెయిల్యూరే కారణమని జేడీపై హైయ్యర్ ఆఫీసర్స్ కన్నెర్ర జేసినట్టు సమాచారం. మొదటిరోజు విచారణ సాదాసీదాగా జరిగిందంటూ.. తనపై ఏ కేసు పెట్టారో చెప్పమంటే ఈడీ అధికారులు చెప్పలేకపోయారంటూ రోహిత్ రెడ్డి మీడియా ముందు చెప్పడంతో ఈడీ కావాలనే కుట్ర చేసిందనే మెుసేజ్ ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇటీవల టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారిన పైలట్ రోహిత్ రెడ్డి కేసు విషయంలో దర్యాప్తు అధికారులు మరీ ఇంత ఉదాసీనంగా ఉండటం వల్లే.. హైదరాబాద్ జేడీపై బదిలీ వేటు పడిందనే చర్చ ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×