E-Paper
Advertisement

Revanth Reddy : మునుగోడులో ఓడినా రేవంత్ కే రాహుల్ గ్రీన్ సిగ్నలా?

Revanth Reddy : మునుగోడులో ఓడినా రేవంత్ కే రాహుల్ గ్రీన్ సిగ్నలా?

Revanth Reddy : రేవంత్ రెడ్డి పనైపోయిందన్నారు. పీసీసీ చీఫ్ పోస్టు ఫసక్ అంటూ ప్రచారం చేశారు. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుందని ఊదరగొట్టారు. సీనియర్లు హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణ. వెంకట్ రెడ్డి వెన్నుపోటు పొడిచారనే విమర్శ. అంతా సహాయ నిరాకరణ, రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం.. దీంతో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి ఓడిపోయింది. ఇక, రేవంత్ పని ఖతం అనుకున్నారు కొందరు. కానీ, సీన్ రివర్స్. మునుగోడులో కాంగ్రెస్ ఓడినా రేవంత్ ప్రాధాన్యం అసలేమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. డౌట్ ఉంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ఓ లుక్ వేయండని చెబుతున్నారు.

ఆరో తేదీన మునుగోడు ఫలితం వచ్చింది. అదే రోజు రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కూడా భారత్ జోడో యాత్రలో యధావిధిగా పాల్గొన్నారు. రేవంత్ ముఖంలో ఏమాత్రం నిరుత్సాహం కనిపించలేదు. రాహుల్ తో ఆయన సాన్నిహిత్యం తగ్గినట్టు లేదు. అదే జోరు.. అదే హోరు.

ఏం జరిగి ఉంటుంది? మునుగోడులో కాంగ్రెస్ ఓడినా రాహుల్ దగ్గర రేవంత్ ప్రయారిటీ ఎందుకు తగ్గలేదు.. అంటూ తెగ ఇదైపోతున్నారట కొందరు సీనియర్లు. ఫలితాలపై రాహుల్ గాంధీకి ఫూర్తి స్థాయిలో అవగాహన కల్పించారట పీసీసీ చీఫ్. అధికార పార్టీ ఆగడాలు, బీజేపీ ధన ప్రవాహంతో పాటు కాంగ్రెస్ లో జరిగిన కుట్రలన్నీ రాహుల్ గాంధీకి వివరించారట రేవంత్ రెడ్డి. తాను ఆర్థికంగా బలమైన కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరితే.. సీనియర్లు రంగంలోకి దిగి స్రవంతికి టికెట్ ఇప్పించిన విధానం.. తీరా ప్రచార సమయంలో ముఖం చాటేసిన వైనం.. వెంకట్ రెడ్డి ఫోన్ కాల్.. ఇలా మునుగోడు రాజకీయం మొత్తాన్ని రాహుల్ ముందుంచారట రేవంత్ రెడ్డి. అన్నీ విన్న రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి వివరణతో సంతృప్తి చెందారని.. గో అహెడ్ అంటూ ప్రోత్సహించారని.. అందుకే మునుగోడులో ఓడినా రేవంత్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ ఛీఫ్ అయ్యాక.. హుజురాబాద్ బైపోల్ లో కాంగ్రెస్ ఓడిపోయింది. మునుగోడులో సిట్టింగ్ సీటు కోల్పోయింది. హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓడి, టీఆర్ఎస్ ను ఓడించిందన్నారు. మునుగోడు ఓటమి మాత్రం హస్తం పార్టీకి చేదు అనుభవమే అయినా.. అక్కడున్న ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల, పార్టీ అంతర్గత కారణాల వల్ల ఓడిపోయామనే భావన వ్యక్తమవుతోంది. అందుకే, ఓడినా రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర పెద్దగా డ్యామేజీ జరగలేదని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×