E-Paper
Advertisement

Road Accident : హైదరాబాద్ లో కారు బీభత్సం.. మద్యంమత్తులో మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం..

Road Accident : హైదరాబాద్ లో కారు బీభత్సం.. మద్యంమత్తులో మాజీ మంత్రి మేనల్లుడి నిర్వాకం..
Today news in telangana

Road Accident in Hyderabad(Today news in telangana):

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ ఫోరం సర్కిల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ మద్యం మత్తులో రాంగ్ రూట్లో కారు నడిపి.. బైక్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి లోనీ ఓ పబ్ లో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ నలుగురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ నేపద్యంలో అగ్రజ్ కారు డ్రైవర్ ను పక్కన పెట్టీ కారు నడిపాడు. కేపీహెచ్‌బీలో రాంగ్ రూట్ లో కారును నడిపి.. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టాడు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. అగ్రజ్ కు బ్రిత్ అనలైజ్ పరీక్ష చేయగా ఆల్కహాల్ 90% నమోదయ్యింది .బైక్ పై ఉన్న ఇద్దరికి త్రీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి మత్రం విషమంగా ఉందని వైద్యులు తెలిలపారు. గాయపడ్డ వారు రాజస్థాన్ కు చెందిన దూర్ చంద్, భన్వర్లాల్ కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

కేపీహెచ్‌బీ పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ఐపీసీ 185(A), 337 , 119 177 MV Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×