Cyber Crime: సైబర్ నేరాల పట్ల ఎంత అవగాహన కల్పించిన సైబర్ వలలో ఎవరో ఒకరూ చిక్కుతూనే ఉంటున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో సైబర్ నేరంలో మరోసారి ఘోరం జరిగింది. ట్రాన్స్కో ఉద్యోగిని బురిడీ అకౌంట్లో ఉన్న 13 లక్షల రూపాయలను నష్టపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి భాస్కర్కు ముందుగా ఒక APK ఫైల్ పంపారు. భాస్కర్ తెలియకుండా ఆ లింక్ను ఓపెన్ చేసిన తర్వాత అతని మొబైల్ హ్యాక్ అయింది. దాంతో అతని బ్యాంక్ అకౌంట్లోని మొత్తం 13 లక్షలు దొంగలు సొమ్ము చోరీ చేశారు.
ఇది సైబర్ క్రైమ్ విధానాలను గుర్తు చేసే ఘటనం. సైబర్ నేరాల కోసం దుష్టులు తరచుగా ఫేక్ లింక్స్, APK ఫైల్స్ లేదా ఫిషింగ్ మెసేజెస్ను ఉపయోగిస్తారు. సైబర్ పోలీసుల ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రజలకు ఫిర్యాదులు చేయడం, అనుమానాస్పద లింక్స్ను క్లిక్ చేయకపోవడం, బ్యాంక్, సోషల్ మీడియా అకౌంట్లలో రెండు దశల ధృవీకరణ (Two-Factor Authentication) ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు సైబర్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం.
ALSO READ: New Year 2026: మీ ఇంట్లో సంపద పెరగాలా ? కొత్త సంవత్సరం వేళ ఇవి తప్పక కొనండి
సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి
TRANSCO ఉద్యోగిని మోసం చేసి రూ.13 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
బూరుగుపల్లి TRANSCO లైన్ మ్యాన్ గా పని చేస్తోన్న భాస్కర్
భాస్కర్ ఫోన్ కి APK ఫైల్ పంపి ఫోన్ హ్యాక్ చేసి డబ్బు కాజేసిన సైబర్ ముఠా
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు… pic.twitter.com/VVC6pLNvVF
— BIG TV Breaking News (@bigtvtelugu) December 25, 2025