BigTV English

Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Supreme Court : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

Supreme Court : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం కేసు సుప్రీంకోర్టుకు చేరింది. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజి సుప్రీంలో సవాల్‌ చేశారు. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ఎదుట నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో ఈ పిటిషన్ ను చేర్చాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.


హైదరాబాద్‌ లోని మొయినాబాద్‌ ఫామ్ హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ముగ్గురు నిందితులు ఆరోపణలు ఎదురొంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుల రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న హైకోర్టు.. నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×