E-Paper
Advertisement

TCongress : నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం.. ఎజెండా ఇదేనా..?

TCongress : నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం.. ఎజెండా ఇదేనా..?

Telangana congress news(TS politics) : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. నేడు గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీకాంగ్రెస్ లో జోష్ పెరిగింది. పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. చేరికల తర్వాత పార్టీ మరింత బలపడనుంది. అందుకే చేరికలపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

మరోవైపు ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గతేడాది రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం ప్రియాంక గాంధీ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ వెల్లడించారు. త్వరలో బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, SC, ST డిక్లరేషన్లు ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు ప్రచారంపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తోంది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×