E-Paper
Advertisement

Rythu Bharosa : అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి రైతులకు పెట్టుబడి సాయం..

Rythu Bharosa : అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి రైతులకు పెట్టుబడి సాయం..
Advertisement
breaking news in telangana

Rythu Bharosa latest news(Breaking news in telangana):

తెలంగాణలో అన్నదాతలకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూసిన రైతులకు.. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్‌బాబు ఉన్నతాధికారులతో చర్చల అనంతరం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రుణమాఫీ విషయంలోనూ కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు.

తెలంగాణలో ఎన్నికల సంగ్రామం కారణంగా అన్నదాతలకు పెట్టుబడి సాయం ఆలస్యమైంది. ఎలక్షన్‌ కోడ్‌ అమలు ఉండటంతో నిలిపివేసిన ఈసీ.. ఆ తర్వాత నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే.. ఇందుకు సంబంధించి రూల్స్‌ని బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు బ్రేక్‌ చేశారన్న కారణంతో తిరిగి నిధుల విడుదలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు రైతులు పంట సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

ఇక ప్రజా కురుక్షేత్రంలో నెగ్గి.. అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ తాము ప్రకటించిన మాదిరి రైతు భరోసాను ఇవ్వాలనుకుంది. అయితే.. ఎన్నికల హామీ ఇచ్చినప్పటికీ.. రైతు భరోసా పథకానికి విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి పాత పద్దతిలోనే నిధులు ఇవ్వాలని ఆదేశించారు రేవంత్‌రెడ్డి. దీంతో ఇవాళ్టి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమకానుంది.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×