Nominated Posts: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల్లో రెండు నామినేటెడ్ పదవులు దక్కాయి. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ ఛైర్మన్ అయినటువంటి కొల్లె సరిత మరియు వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ ఛైర్మన్ అయినటువంటి గట్టు తిమ్మప్ప కు నామినేటెడ్ పదవులు దక్కాయి.
తెలంగాణ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం 17 కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు వైస్ చైర్మన్లను నియమించింది. తెలంగాణలో నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఈ మేరకు వివరాలను టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ప్రకటించారు.
Also Read: తమిళనాడులో విజయ్ గెలవడంలో ఆశ్చర్యం లేదు..నటి శ్రియ కామెంట్స్ వైరల్!
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సరిత తిరుపతయ్యతో పాటు గట్టు తిమ్మప్పకు పదవులు వరించాయి. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ ఛైర్మన్గా కొల్లె సరిత, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ ఛైర్మన్ గా గట్టు తిమ్మప్పలను నియమించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Also read: హైడ్రా పేదల కోసమేనా? నాదర్గుల్లో చెరువుల కబ్జాపై హైడ్రా ఎందుకు నిద్రపోతోంది?: హరీశ్ రావు