E-Paper
Advertisement

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!
Advertisement

Revanth Reddy: ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్ళాలని అన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. నెహ్రూ ముందు చూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుందని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీదని గుర్తు చేశారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారని సీఎం రేవంత్ తెలిపారు.

రైతులపై కేసులు..

అగ్రికల్చర్ యాక్ట్ తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరాగాంధీ గాందిదని, పీడీఎస్ విధానం తీసుకో తీసుకొచ్చి రేషన్ షేప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ సొంతం అని అన్నారు. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సాంబ బియ్యం అందిస్తున్నామంటే అనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల కృషినే కారణం. రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్ అని అన్నారు. ఆనాడు 1300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్ రారాజుగా నిలిచారని అన్నారు. తెలంగాణలో సాగు నీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్ దని గుర్తుచేశారు.

Advertisement

Also read: యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

వైఎస్ చివరి కోరిక..

ఆనాడు వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్ బీసీ ఇప్పుడు ఆగిపోయాయి. వారి ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తాం ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్ బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ అభిమానులకు ఒక మాట గుర్తు చేస్తున్నా. వైఎస్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారుని అన్నారు. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలని, అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం అని సీఎం రేవంత్ కొనియాడారు.

రాహుల్ గాంధీ..

Advertisement

దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైస్ కు నిజమైన నివాళని, ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానినిచేయాలని అన్నారు. ఇందుకు మీ అందరి మద్దతు అవసరం. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మనమంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also read: వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

Tags

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×