E-Paper
Advertisement

Medchal district : తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Medchal district : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీర్జాదిగూడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మహిళ బ్రాంచ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉరి వేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి చెప్పగా. వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించిదని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Medchal district :  తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
Medchal district

Medchal district : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీర్జాదిగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాల మహిళ బ్రాంచ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఉరి వేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి చెప్పారు. వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించిదని వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వర్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

వర్ష ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్వస్థలం వనపర్తి జిల్లా వీపన్నగండ్ల గ్రామమని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవటం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

కళాశాల యాజమాన్యం వర్ష డెడ్ బాడీని గుట్టుచప్పుడు కాకుండా గాంధీ ఆసుపత్రికి తరలించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×