E-Paper
Advertisement

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుంది.. నాగ్ పూర్ సభలో రాహుల్ ఫైర్

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుంది.. నాగ్ పూర్ సభలో రాహుల్ ఫైర్
Advertisement

Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుందని అందుకే అధికారం కోసం కుట్రలు చేస్తున్నారని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నాగ్ పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కొంత మంది బీజేపీలో ఉన్నా..వాళ్ల మనసంతా కాంగ్రెస్ వైపే ఉందన్నారు. ఎందుకంటే బీజేపీలో బానిసత్వం ఉంటుంది. అది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయడానికే ఉందన్నారు. దేశంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలి కానీ బీజేపీ పాలనలో కొంత మంది పెద్దల చేతుల్లోనే ఉందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ దేశానికి ఏం ఇచ్చింది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. సంస్థానాలకు, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ఈ దేశం కోసం నెహ్రూ, గాంధీలు జైలుకెళ్లారన్నారు. రైతులపై బీజేపీ జీఎస్టీ విధించింది. రైతుల జీవితాలను ఆడుకుంటుంది. మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ సైద్దాంతికంగా పోరాడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది, బీజేపీలో ఎంపీల అభిప్రాయాలకే విలువ లేదన్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్నతేడా ఇదే అన్నారు. బీజేపీలో ఇప్పటికీ రాజరికం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉందన్నారు.

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×