NEET Students: తెలంగాణ ప్రభుత్వం నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షరాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల జూన్ 21 వ తేదీన నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
నీట్ రాసే విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి మంత్రి పోన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో నీట్ పరీక్షరాసే విద్యార్థులకు కొంత ఉపశమనం కానుంది. దేశంలో ఇప్పటికే నీట్ పరీక్ష లీకేజీతో సంచలనం సృష్టించింది.
Also Read: స్క్రీన్పై భయపెట్టిన ‘సమారా’ ఇక లేదు.. 35 ఏళ్లకే ‘ది రింగ్’ నటి డేవేగ్ చేజ్ హఠాన్మరణం!
దేశంలో నీట్ పరీక్ష జరగడానికి ముందు బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే కొందరు విద్యార్థులకు ముందుగానే సమాధానాలు దొరికినట్లు గతంలో పోలీసులు సైతం గుర్తించారు. దేశ రాజదాని ఢిల్లిలో నేటికి నీట్ ప్రశ్నాపత్రం వివాధం జరుగూతూనే ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతాపార్టీ సైతం ఢిల్లీలో భారీగా ధర్నాలు చేస్తున్నారు.
Also read: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. వైసీపీలో గుబులు మొదలు, మాజీ మంత్రి కొడుకు అరెస్ట్