Kishan Reddy: కేటీఆర్ సింగరేణికి అన్యాయం చేశారని అంటున్నారు. జరిగిన నష్టం ఏంటో సింగరేణి పై చర్చకు కేసీఆర్ సిద్ధమా అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యరు. సింగరేణి కార్మిక సంఘాలు ఏకమయ్యి రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు ఉన్న వాటిని వెంటనే చెల్లించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోలు, అవమానంగా మాట్లాడడం, మోడీ తల్లిపై రాతలు రాయడం పై పోలీసులకు బీజేపీ నేత సాయి కిరణ్ గౌడ్ హైదరాబాద్లో పిర్యాదు చేశాడు.
ఇది దేశ ప్రజలను అవమానించడం అని బీజేపీ నేత సాయి గౌడ్ అన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఎవరు పోస్టులు పెట్టారనేది విచారణలో తేలుతుందని, meta india పై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టారని తెలిపారు. అయితు ఈ విషయం పై కేసు నమోదు చేసిన పోలీసుల అధికారిని తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తుందని తెలిపారు. డీసిపి ఆనంద్ను కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయని అన్నారు.
Also Read: క్షుద్రపూజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తెలంగాణ.. అజ్ఞాన ప్రదర్శనలో బిజీగా రెండు పార్టీలు!
మీరు రాహుల్ గాంధీపై కేసులు ఎలా పెట్టారని మాట్లాడినట్టుగా తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆరు నెలల్లో ఒక్క జిల్లాకు ముగ్గురు కలెక్టర్లు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. మ్యూజికల్ చైర్ లాగా ప్రభుత్వ అధికారుల బదిలీ మారిపోయిందని, కేసీఆర్ ఫామ్ హౌస్ ఫైల్స్ తీశాడు ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కుటుబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని గుర్తు చేశాడు. కేసీఆర్ కుమార్తె కవిత నేరుగా తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని చెప్పిందని ఆమే తెలిపారని గుర్తు చేశారు.
Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!