Mehdipatnam: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. షియా వర్గానికి చెందిన ముస్లింలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పెద్దలు, చిన్నారులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి హైదరాబాద్ సిటీలోని మెహదీపట్నం ప్రాంతంలో ముస్లింలు చేపట్టిన ర్యాలీలో హైటెన్షన్ నెలకొంది.
ఖమేనీ మృతితో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ర్యాలీ, నిరసనలు
అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన మృతికి నిరసనగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు ముస్లింలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని మెహిదీపట్నంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఆసిఫ్నగర్ నుంచి మెహిదీపట్నం వరకు చేపట్టిన ర్యాలీలో షియా గ్రూప్ ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఖమేని ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ తీరుపై వారంతా మండిపడ్డారు. నల్ల జెండాలు పట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంజాన్ మాసంలో ఖమేని మృతికి తాము శాంతియుతంగా నిరసనలు చేస్తున్నట్లు చెప్పారు.
అర్ధరాత్రి మెహదీపట్నంలో హైటెన్షన్
ఈ విషయంలో ట్రంప్ ముమ్మాటికీ తప్పు చేశారని ఆరోపించారు. ఖమేనీ మరణానికి సంతాపం తెలిపేందుకు నల్లటి దుస్తులు ధరించిన వందలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు గుమిగూడారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతటా నిరాశ అలలు అలుముకుంది. ఖతూన్ సమాధి దగ్గర భావోద్వేగ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నిరసనలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి అమెరికాకు వ్యతిరేక నినాదాలు చేశారు.
ALSO READ: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై స్కోర్ కార్డ్.. సీఎం చేతికి చేరిన సర్వే రిపోర్టు..?