E-Paper
Advertisement

Mehdipatnam: ఖమేనీ మృతితో ముస్లింలు ర్యాలీ, నిరసనలు.. అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్

Mehdipatnam: ఖమేనీ మృతితో ముస్లింలు ర్యాలీ, నిరసనలు.. అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్
Advertisement

Mehdipatnam: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. షియా వర్గానికి చెందిన ముస్లింలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పెద్దలు, చిన్నారులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి హైదరాబాద్ సిటీలోని మెహదీపట్నం‌ ప్రాంతంలో ముస్లింలు చేపట్టిన ర్యాలీలో హైటెన్షన్ నెలకొంది.

ఖమేనీ మృతితో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ర్యాలీ, నిరసనలు

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన మృతికి నిరసనగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు ముస్లింలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని మెహిదీపట్నంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఆసిఫ్‌నగర్‌ నుంచి మెహిదీపట్నం వరకు చేపట్టిన ర్యాలీలో షియా గ్రూప్ ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీలో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఖమేని ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేత పట్టుకుని నినాదాలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ తీరుపై వారంతా మండిపడ్డారు. నల్ల జెండాలు పట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రంజాన్ మాసంలో ఖమేని మృతికి తాము శాంతియుతంగా నిరసనలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

అర్ధరాత్రి మెహదీపట్నం‌లో హైటెన్షన్

ఈ విషయంలో ట్రంప్ ముమ్మాటికీ తప్పు చేశారని ఆరోపించారు. ఖమేనీ మరణానికి సంతాపం తెలిపేందుకు నల్లటి దుస్తులు ధరించిన వందలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు గుమిగూడారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంతటా నిరాశ అలలు అలుముకుంది. ఖతూన్ సమాధి దగ్గర భావోద్వేగ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నిరసనలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి అమెరికాకు వ్యతిరేక నినాదాలు చేశారు.

ALSO READ: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై స్కోర్ కార్డ్.. సీఎం చేతికి చేరిన సర్వే రిపోర్టు..?

 

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×