Kompalli: క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురువే కక్షపూరితంగా వ్యవహరించడం కొంపల్లిలో సంచలనం సృష్టించింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సూర్య అనే విద్యార్థి తన మాట వినడం లేదన్న చిన్న కారణంతో, ప్రధానోపాధ్యాయుడు కృష్ణ విచక్షణ కోల్పోయారు. స్వయంగా దండించడమే తప్పనుకుంటే, ఏకంగా 10వ తరగతి విద్యార్థులను ఉసిగొల్పి ఆ చిన్నారిపై దాడి చేయించడం విద్యావేత్తలను షాక్కు గురిచేసింది. పాఠశాల ఆవరణలోనే పెద్ద విద్యార్థులు చిన్న పిల్లాడిపై విచక్షణారహితంగా దాడి చేస్తుంటే, వాదించాల్సిన హెడ్ మాస్టర్ దగ్గరుండి ప్రోత్సహించారనే ఆరోపణలు విద్యాశాఖలో కలకలం రేపుతున్నాయి.
గాయపడిన విద్యార్థి – తల్లడిల్లిన తల్లిదండ్రులు
పదో తరగతి విద్యార్థుల దాడిలో సూర్య తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటిపై వాతలు పడటమే కాకుండా, అంతర్గత గాయాలవడంతో ఆ విద్యార్థి భయంతో వణికిపోయాడు. సూర్య ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. తన కొడుకును విద్యావంతుడిని చేయమని పంపిస్తే, ఇలా గాయాలతో ఇంటికి రావడం చూసి తండ్రి శివ రామకృష్ణ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే ఆయన తోటి గ్రామస్తులతో కలిసి పాఠశాలకు వెళ్లి హెడ్ మాస్టర్ను నిలదీశారు. అయితే ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
అయితే బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. సెక్షన్ల వారీగా ప్రధానోపాధ్యాయుడు కృష్ణతో పాటు, దాడికి పాల్పడిన విద్యార్థుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, పాఠశాలలోని ఇతర విద్యార్థుల నుండి వాంగ్మూలాన్ని సేకరించారు. హెడ్ మాస్టర్ తీరు మొదటి నుంచీ ఇలాగే ఉందా? లేక సూర్య విషయంలోనే ఇలా ఎందుకు వ్యవహరించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నివేదిక ఆధారంగా హెడ్ మాస్టర్పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.
Also Read: ప్రియుడి మోజులో భర్తను చిదిమేసిన భార్య.. మేడిపల్లి హత్య కేసులో విస్తుపోయే నిజాలు!
విద్యా వ్యవస్థకు మాయని మచ్చ..
పాఠశాలలు అంటే విద్యాబుద్ధులు నేర్చుకునే దేవాలయాలు. అక్కడ విద్యార్థుల మధ్య ప్రేమ, స్నేహం పెంచాల్సింది పోయి, ఇలా సీనియర్ విద్యార్థులతో జూనియర్లపై దాడులు చేయించడం విద్యా వ్యవస్థకే మాయని మచ్చగా మారింది. ఈ ఘటన వల్ల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హెడ్ మాస్టర్ తన వ్యక్తిగత కక్షల కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవడం వల్ల ఆ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సదరు ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన మరో 9 మంది విద్యార్థులు
హైదరాబాద్-కొంపెల్లి సర్కిల్ పరిధి జిల్లా పరిషత్ హైస్కూల్లో దారుణం
ఏడో తరగతి చదువుతున్న ఫణీంద్ర(సూర్య) అనే విద్యార్థిని చితకబాదిన 10వ తరగతి విద్యార్థులు
విద్యార్థులు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి నిర్లక్ష్యం… pic.twitter.com/wH3WTYVAh6
— BIG TV Breaking News (@bigtvtelugu) December 23, 2025