Telangana : తెలంగాణలో దశాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రభుత్వం రోజుకో కార్యక్రమం చేపడుతోంది. ఆదివారం సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు చేరువగా మెగా సిటీ పోలీసింగ్ ఉంటుందని వినూత్న కార్యక్రమాల ద్వారా చెబుతున్నారు.
ట్యాంక్బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ ర్యాలీని ప్రారంభించారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. పోలీస్ గస్తీ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ర్యాలీలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ అంజనీ కుమార్, 3 కమిషనరేట్ల సీపీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.