E-Paper
Advertisement

TSRTC Revenue | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పెరిగిన ఆర్టీసీ ఆదాయం.. ఎలాగో తెలుసా?

TSRTC Revenue | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తాయని అందరూ భావించారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ సంస్థకు లాభాలు వస్తున్నాయి.

TSRTC Revenue | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పెరిగిన ఆర్టీసీ ఆదాయం.. ఎలాగో తెలుసా?
Advertisement

TSRTC Revenue | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. రాష్ట్రమంతటా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తాయని అందరూ భావించారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆర్టీసీ సంస్థకు లాభాలు వస్తున్నాయి.

పథకం ప్రారంభమైన వారం రోజుల వరకు మహిళలందరూ ఎటువంగి గుర్తింపు కార్డులు చూపించకుండా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఓ కీలక ప్రకటన చేశారు. మహిళలు తెలంగాణ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడీ కార్డ్ చూపిస్తే బస్సు కండక్టర్ నుంచి జీరో టికెట్ పొందవచ్చు. తెలంగాణ వాసిగా గుర్తింపు కార్డు లేకపోతే డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాల్సిందే. లేకపోతే రూ.500 జరిమానా విధిస్తారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రమంతా నిత్యం 13 లక్షల ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో ఉచిత పథకం కింద 80 శాతం వరకు మహిళలే ప్రయాణిస్తున్నారని సమాచారం. దీనివల్ల ఆర్టీసికి నష్టాలు వస్తాయని అందరూ భావించినా.. ఆ నష్టాన్ని ప్రభుత్వం రీఅంబర్స్ చేస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం జీరో టికెట్ లెక్కలు.. ప్రభుత్వానికి పంపితే ఆ మొత్తాన్ని రీయంబర్స్ మెంట్ ద్వారా తిరిగి వస్తుంది. ఉచిత టికెట్ పథకం మొదలైనప్పటి నుంచి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నవంబర్ నెల వరకు గణాంకాలు పరిశీలిస్తే.. ఆర్టీసీకి రోజుకు రూ. 13 లక్షల నుంచి రూ.14 లక్షల ఆదాయం రాగా.. పథకం ద్వారా 18-25 లక్షలకు పెరిగిందని అంచనా.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×