Farm house Case :
తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించిన ఎపిసోడ్లో ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నందకుమార్ పై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో లింకులు ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని తుషార్ అనే వ్యక్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. రామచంద్రభారతి, రోహిత్రెడ్డితో తుషార్ ఫోన్లో మాట్లాడారని ఆరోపణలున్నాయి. తుషార్కు బీజేపీ కీలక నేతలు సన్నిహితులు అంటూ మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఫోన్ సంభాషణ కొనసాగింది.
గత లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లో రాహుల్ గాంధీపై తుషార్ పోటీ చేశారు. దీంతో సిట్ బృందం కేరళలో దర్యాప్తు ప్రారంభించింది. అలాగే రామచంద్రభారతి ప్రధాన అనుచరుడు జగ్గుస్వామి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తుషార్ను రామచంద్రభారతికి పరిచయం చేసింది జగ్గుస్వామే అని సమాచారం.