E-Paper
Advertisement

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!
Advertisement

Liquor Scam :

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేగం పెంచింది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి పెట్టింది. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివల్ కు చెందిన జెట్‌ సెట్‌ గో సంస్థ ఏర్పాటు చేసిన చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఇప్పటికే ఈడీ సేకరించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఆ విమానాల్లో ఎక్కువగా ప్రయాణించినట్లు గుర్తించింది.

Advertisement

ఢిల్లీలో పలువురు మద్యం వ్యాపారులు, అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు సమావేశమైన తేదీలు, ఆ సమయంలో చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఈడీ విశ్లేషిస్తోంది. గత నెలలో ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి వచ్చిన డేటాలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రైవేట్‌ జెట్‌ మేనేజర్లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×