BigTV English
Advertisement

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!

Liquor Scam :


ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేగం పెంచింది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి పెట్టింది. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ పెనక శరత్‌చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివల్ కు చెందిన జెట్‌ సెట్‌ గో సంస్థ ఏర్పాటు చేసిన చార్టర్డ్‌ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఇప్పటికే ఈడీ సేకరించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఆ విమానాల్లో ఎక్కువగా ప్రయాణించినట్లు గుర్తించింది.

ఢిల్లీలో పలువురు మద్యం వ్యాపారులు, అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు సమావేశమైన తేదీలు, ఆ సమయంలో చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఈడీ విశ్లేషిస్తోంది. గత నెలలో ఎయిర్‌పోర్టు అథారిటీ నుంచి వచ్చిన డేటాలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రైవేట్‌ జెట్‌ మేనేజర్లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×