E-Paper
Advertisement

Yadadri Power Plant : యాదాద్రి పవర్ ప్లాంట్.. అంచనాలు డబుల్.. అవినీతి లెక్కలు తేల్చే పనిలో విజిలెన్స్..

Yadadri Power Plant : ప్రతి పనిలో అవినీతి. డబుల్‌ అయిన అంచనాలు. తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో మొదలుపెట్టిన యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ అల్ట్రా థర్మల్‌ పవర్ ప్లాంట్ అభాసుపాలైంది.

Yadadri Power Plant : యాదాద్రి పవర్ ప్లాంట్.. అంచనాలు డబుల్.. అవినీతి లెక్కలు తేల్చే పనిలో విజిలెన్స్..
Advertisement
This image has an empty alt attribute; its file name is 02c988e1e2c701afc4dae1df08630f87.jpg

Yadadri Power Plant : ప్రతి పనిలో అవినీతి. డబుల్‌ అయిన అంచనాలు. తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్లతో మొదలుపెట్టిన యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ అల్ట్రా థర్మల్‌ పవర్ ప్లాంట్ అభాసుపాలైంది.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద గత ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. 2015 జూన్‌ 8న.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్లాంట్ నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. 4,200 ఎకరాలలో.. 28 వేల కోట్ల వ్యయంతో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టు పనులను 2017 అక్టోబర్ 17న జెన్కో ప్రారంభించింది. నిర్మాణ బాధ్యతలను BHELకు అప్పగించింది.

Advertisement

పనులలో తీవ్ర జాప్యం జరగటంతో నిర్మాణ వ్యయం రెట్టింపు అయ్యి.. 56 వేల కోట్లకు చేరుకుంది. బీహెచ్‌ఈఎల్‌ చేపట్టిన ప్లాంటు ప్రధాన పనులను ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే పూర్తి చేసినట్లు సమాచారం. అంచనా వ్యయానికి ఇప్పటికి 80 శాతం నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే వెచ్చించిన వ్యయం వివరాలను ఇప్పటివరకు జెన్‌కో అధికారులు వెల్లడించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు.

మరోవైపు.. విద్యుత్‌ బాయిలర్ల నిర్మాణాలు,ఇతరత్రా పనుల కోసం సుమారు 20 వేల కోట్ల విలువైన టెండర్లను జెన్‌కో అధికారులు తమకు అనుకూలమైన సంస్థలకే వచ్చే విధంగా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాంటు నిర్మాణం కోసం కావలసిన భూసేకరణ విషయంలో కూడా పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. 2015 నుంచి 2023 వరకు భూనిర్వాసితులకు 100 కోట్ల మేర చెల్లించారు. ఈ చెల్లింపులపై కూడా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు.

Advertisement

యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నూతన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకోనిరావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో విజిలెన్స్‌ బృందం విచారణ చేపట్టింది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×