E-Paper
Advertisement

BJPLP Leader: బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్.. వారిద్దరి మధ్యే పోటీ

BJPLP Leader: బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్.. వారిద్దరి మధ్యే పోటీ
BJP news in telangana

BJP news in telangana(TS politics):

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేతపై చర్చిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. అందులో ఆరుగురు కొత్తవారే ఉన్నారు. రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి మాత్రమే ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డి కాకుంటే కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట రమణారెడ్డికి ఛాన్స్‌ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధిష్టానం రాజాసింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించే యోచనలో ఉంది బీజేపీ. అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండడంతో తాము ప్రమాణం చేయబోమని ఇప్పటికే రాజాసింగ్‌ ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తారా.. లేదా అనే దానిపై సందిగ్ధం నెలకొంది.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×