E-Paper
Advertisement

Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..

Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..
Telangana news updates

Hyderabad latest news(Telangana news updates):

యూట్యూబ్‌ ద్యారా తెలుసుకున్న జ్యోతిష్యం ప్రకారం.. తాను- తన భర్త విడిపోతామని బలంగా నమ్మి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని అంబర్‌పేటకు చెందిన బబిత అనే యువతికి ఐదేళ్లక్రితం బాలంరాయికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో వివాహం జరిగింది. వీరిద్దరూ కానాజిగూడ ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.

ఆదివారం బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బబిత తల్లిదండ్రులు తప్ప బంధుమిత్రులంతా హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీస్ కి వెళ్లాడు. రెండుగంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూశాడు. కింది పోర్షన్‌లో ఉన్న బాబాయికి వద్దకు వెళ్లి చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు వచ్చి రామకృష్ణ పై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్తింటివారు తెలిపిన వివరాల ప్రకారం.. బబితకి జ్యోతిష్య మంటే ఎంతో నమ్మకం. జ్యోతిష్యాన్ని నమ్మవద్దని బబితను రామకృష్ణ పదేపదే కోరేవాడు. దీనిపై ఇటీవల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందరి ముందు రామకృష్ణ ఆమెను కొట్టాడు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెబుతున్నారు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×