BigTV English

Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..

Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య ఆత్మహత్య..
Telangana news updates

Hyderabad latest news(Telangana news updates):

యూట్యూబ్‌ ద్యారా తెలుసుకున్న జ్యోతిష్యం ప్రకారం.. తాను- తన భర్త విడిపోతామని బలంగా నమ్మి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని అంబర్‌పేటకు చెందిన బబిత అనే యువతికి ఐదేళ్లక్రితం బాలంరాయికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణతో వివాహం జరిగింది. వీరిద్దరూ కానాజిగూడ ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.


ఆదివారం బాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బబిత తల్లిదండ్రులు తప్ప బంధుమిత్రులంతా హాజరయ్యారు. సోమవారం ఉదయం భర్త ఆఫీస్ కి వెళ్లాడు. రెండుగంటలకు అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి.. తన తల్లి ఇంట్లో ఫ్యానుకు వేలాడుతుండటం చూశాడు. కింది పోర్షన్‌లో ఉన్న బాబాయికి వద్దకు వెళ్లి చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు వచ్చి రామకృష్ణ పై దాడిచేశారు. అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్తింటివారు తెలిపిన వివరాల ప్రకారం.. బబితకి జ్యోతిష్య మంటే ఎంతో నమ్మకం. జ్యోతిష్యాన్ని నమ్మవద్దని బబితను రామకృష్ణ పదేపదే కోరేవాడు. దీనిపై ఇటీవల వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అందరి ముందు రామకృష్ణ ఆమెను కొట్టాడు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెబుతున్నారు.


Related News

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

UP Crime News: మైనర్ ప్రియురాలిని కాల్చిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది? యూపీలో దారుణం

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Big Stories

×