E-Paper
Advertisement

Congress Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

Congress Party: బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
Advertisement

Brs Mlc’s Join in Congress Party: తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.

ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్ పల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య ఉన్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు పెరిగింది. మొత్తం మండలిలో సభ్యుల సంఖ్య 40 ఉండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

వరుస పరాజయాలతో చతికిలపడిన బీఆర్ఎస్ పార్టీకి మనోధైర్యం నింపడానికి ఒకవైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తుండగా..మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా, ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేరోజు కాంగ్రెస్ గూటికి చేరడం బీఆర్ఎస్ పార్టీకి చావు దెబ్బ కొట్టినట్లు అయింది.

Advertisement

వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో సాధ్యం కాలేదు. ఒకవైపు ఈనెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందు రోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాగా, రెండు రోజుల క్రితమే సీనియర్ నేత కె.కేశవరావు కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×