BigTV English

Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు.. బీరువాల్లో నోట్లకట్టలు

Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు.. బీరువాల్లో నోట్లకట్టలు

Odisha: ఇటీవల వరుసగా పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో సోదాలు నిర్వహించేందుకు వెళ్ళిన ఐటీ శాఖ అధికారులకు బీరువాల నిండుగా నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒడిశా లోని పలువురు మద్యం వ్యాపారులు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారనే సమాచారంతో.. ఐటీ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.


తాజాగా టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. దాదాపు 510 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతో పాటు ఝార్ఖండ్‌, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.

మరోవైపు రాయగడ గాంధీనగర్‌లో ఉంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల ఇంకా వెల్లడించాల్సి ఉంది.


Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×