BigTV English

Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు.. బీరువాల్లో నోట్లకట్టలు

Odisha: ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు.. బీరువాల్లో నోట్లకట్టలు

Odisha: ఇటీవల వరుసగా పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో సోదాలు నిర్వహించేందుకు వెళ్ళిన ఐటీ శాఖ అధికారులకు బీరువాల నిండుగా నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒడిశా లోని పలువురు మద్యం వ్యాపారులు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారనే సమాచారంతో.. ఐటీ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.


తాజాగా టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. దాదాపు 510 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతో పాటు ఝార్ఖండ్‌, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది.

మరోవైపు రాయగడ గాంధీనగర్‌లో ఉంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల ఇంకా వెల్లడించాల్సి ఉంది.


Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×