BigTV English

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి హైదరాబాద్-ముంబై హైవేపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే పక్కకు బస్సు ఆపేయడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.


బస్సులో ఉన్న ప్రయాణికుల వస్తువులు బూడిదయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఒకవేళ డ్రైవర్‌ అప్రమత్తం కాకపోయింటే? కాసింత నిర్లక్ష్యంగా ఉండి ఉంటే ? పరిస్థితి ఊహిస్తుంటేనే.. ఒళ్లు వణుకుపుడుతోందని.. పదుల సంఖ్యలో ప్రాణాలు బూడిదయ్యేవని ప్రయాణికులు అంటున్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నామని చెబుతున్నారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×