BigTV English

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డిలో బస్సు దగ్ధం.. తృటిలో తప్పిన ప్రాణనష్టం

Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి హైదరాబాద్-ముంబై హైవేపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే పక్కకు బస్సు ఆపేయడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.


బస్సులో ఉన్న ప్రయాణికుల వస్తువులు బూడిదయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఒకవేళ డ్రైవర్‌ అప్రమత్తం కాకపోయింటే? కాసింత నిర్లక్ష్యంగా ఉండి ఉంటే ? పరిస్థితి ఊహిస్తుంటేనే.. ఒళ్లు వణుకుపుడుతోందని.. పదుల సంఖ్యలో ప్రాణాలు బూడిదయ్యేవని ప్రయాణికులు అంటున్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నామని చెబుతున్నారు.


Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×