BigTV English

RBI : వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..

RBI : వడ్డీరేట్లలో మార్పులేదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..


RBI : కీలక రేట్లను RBI యథాతథంగా ఉంచింది. పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నామని ప్రకటించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంచారు.

రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కీలక రేట్లలో ఆర్‌బీఐ మార్పులు చేయదని వార్తలు వచ్చాయి. ఆర్థిక విశ్లేషణలు అదే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే RBI వడ్డే రేట్లను మార్చలేదు.


గత పరపతి విధాన కమిటీ సమావేశంలోనూ రెపో రేటును ఎలాంటి మార్పు చేయలేదు. అప్పుడు కూడా 6.5 శాతంగానే ఉంచారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా 6 దఫాల్లో రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్ల వరకు ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠంగా ఉంది . అప్పుడు 4.7 శాతానికి దిగివచ్చింది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×